fbpx
Thursday, April 25, 2024
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి!

NEW-DGP-FOR-ANDHRAPRADESH-KASIREDDY-RAJENDRANATH-REDDY

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు నూతన డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇవాళ నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఆయన విజయవాడ సీపీగా, విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కూడా పని చేసిన అనుభవం ఆయనకుంది. ఎన్నో కీలక కేసుల్లో కసిరెడ్డి ముఖ్య భూమిక పోషించారు.

తన సర్వీస్‌లో కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular