స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ గెలుపుల పరంపరకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. వరుసగా 7 విజయాల తర్వాత ముంబై, డక్వర్త్ లూయిస్ ప్రకారం మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
వర్షం ఆటను రెండు సార్లు ఆపడంతో, చివర్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన గుజరాత్.. దీపక్ చాహర్ వేసిన ఓవర్లో విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ అర్ధసెంచరీతో మెరిశాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ రెండు వికెట్లు తీసాడు.
అనంతరం లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ 147 పరుగులతో విజయాన్ని అందుకుంది. గిల్, బట్లర్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై తరఫున బుమ్రా, అశ్వని కుమార్ ఇద్దరూ ఇద్దరు వికెట్లు తీశారు.
మ్యాచ్ చివర్లో ముంబైకి విజయం దగ్గరలో ఉన్నట్టు కనిపించినా, చివరి ఓవర్లో చాహర్ అదుపుతప్పి వరుసగా బౌండరీ, సిక్స్, నోబాల్తో మ్యాచ్ చేజార్చేశాడు. తెవాటియా, కోయిట్జీ హిట్స్తో గుజరాత్ చేతిలో విజయం లాంఛనమైంది. హార్దిక్ పాండ్యా చేత రనౌట్ అవకాశం కోల్పోవడం కూడా ముంబై ఓటమికి కారణమైంది.
ఈ ఓటమితో ముంబై పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గుజరాత్ ప్లేఆఫ్స్కు చేరువయ్యింది.