పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు చివరికి ఓ కొలిక్కి వచ్చింది. క్రిష్-జ్యోతిక్రిష్ణ రూపొందించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ ఇప్పుడు కీలక ఘట్టంలోకి ప్రవేశించింది.
ఇప్పటికే కొన్ని రోజులుగా సినిమా స్టాగ్ అయినప్పటికీ, నేడు పవన్ కళ్యాణ్ స్వయంగా షూటింగ్లో జాయిన్ కావడంతో అభిమానుల్లో హర్షాతిరేకం నెలకొంది. రెండు రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్తో సినిమా చివరి దశను పూర్తిచేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
ఈ సమాచారాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించడంతో పాటు, త్వరలోనే ట్రైలర్, పాటలు విడుదలకు రెడీగా ఉన్నాయని కూడా తెలియజేశారు. అంతేకాకుండా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు సంకేతాలు ఉన్నాయి.
ఎంఎం కీరవాణి అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎపిక్ ప్రొడక్షన్ వాల్యూస్తో, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ ఫ్యాన్స్కి గర్వకారణంగా మారనుంది.
మొత్తానికి పవన్ మళ్లీ సెట్లో అడుగుపెట్టడంతో హరిహర వీరమల్లు కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకుంది. విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.