fbpx
Wednesday, April 24, 2024
HomeTelanganaవైద్యశాఖను మరింత బలోపేతం చేస్తాం: ఈటెల

వైద్యశాఖను మరింత బలోపేతం చేస్తాం: ఈటెల

ETELA-RAJENDAR-SAYS-IMPROVING-MEDICAL-FACILITIES

హైద‌రాబాద్ : కరోనా లాంటి వైరస్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం నెలకొంద‌ని తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన‌ట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆ దిశగా పనిచేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈటల రాజేందర్ అధ్యక్షత‌న ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం స‌మావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఎర్ర‌బెల్లి దయాకర్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ స‌హా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా అందరూ ఇళ్ళకు మాత్రమే పరిమితమైతే ఆరోగ్య‌శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయ్యింద‌ని మంత్రి పేర్కొన్నారు. క‌రోనా లాంటి క‌ష్ట‌కాలంలో పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప‌రిస్థితి అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్యశాఖ కృషి ఫలితమే అని తెలిపారు. ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్యారోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతుందని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పనిచేసింద‌ని ప్ర‌శంసించిన మంత్రి ఇందులో భాగ‌స్వాములైన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

రానున్న కాలంలో వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంద‌ని కేటీఆర్ అన్నారు. ఈసారి సీజ‌న‌ల్ వ్యాధులు కూడా త‌గ్గాయ‌ని మాతా, శిశు మరణాల రేటు సైతం త‌గ్గింద‌ని తెలిపారు. వివిధ ర‌కాలైన వ్యాధుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో బాగా అవగాహన పెరిగిందన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular