స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడి టోర్నమెంట్కి గుడ్బై చెప్పింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీఫైనల్కి చేరే అవకాశాలను కోల్పోయింది.
అయితే, ఇదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్పై భారత అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. భారత్తో వన్డే సిరీస్లో వరుస ఓటముల తర్వాత డకెట్ ఇచ్చిన కామెంట్స్ ఇప్పుడు తిరగబడ్డాయి.
“మేము 3-0 తేడాతో వన్డే సిరీస్ ఓడినా ఫరవాలేదు. టీమిండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం” అని ఆయన ధీమాగా చెప్పాడు. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ ఫైనల్ కు వెళ్లలేకపోయింది.
దాంతో భారత అభిమానులు డకెట్పై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. “పాపం.. ఫైనల్లో టీమిండియాను ఓడిస్తామన్న డకెట్ కల నెరవేరలేదు” అని ఒకరు కామెంట్ చేయగా, “అన్ని అనుకున్నట్టు జరిగితే కదా!” అంటూ మరొకరు ట్రోల్ చేశారు.