fbpx
HomeBig Storyభారత్ లో శిశు మరణాలు తగ్గుదల

భారత్ లో శిశు మరణాలు తగ్గుదల

CHILD-MORTALITY-LEVELS-TRENDS-2020

న్యూయార్క్: న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. 1990–2019 సంవత్సరాల మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లోనే సంభవిస్తున్నాయని తెలిపింది.

‘చైల్డ్‌ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్స్‌ 2020’ పేరుతో ఐరాస ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి ఆ సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే సంఖ్య భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి గణనీయంగా తగ్గింది.

భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయ్యి మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పట్టాయి.

అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్‌ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి. సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular