fbpx
HomeTelanganaనేడు కేంద్ర బృందం తెలంగాణకు రాక

నేడు కేంద్ర బృందం తెలంగాణకు రాక

CENTER-TEAM-VISITS-TELANGANA-LOSS-ESTIMATION

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లు ఇళ్ళు సముద్రాన్ని తలపించాయి. ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాలు ఇంకా అడపా దడపా కురుస్తూనే ఉన్నాయి.

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. గురు, శుక్రవారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టం తీవ్రతను తెలుసుకోనుంది. ఈనెల 13 నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్‌ నగరం తో పాటు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

ఈ కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శించనుంది. వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల మేరకు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1,350 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular