fbpx
Tuesday, April 23, 2024
HomeTelanganaపీవీ నరసింహరావు కు భారతరత్న కోసం తీర్మానం!: కేసీఆర్

పీవీ నరసింహరావు కు భారతరత్న కోసం తీర్మానం!: కేసీఆర్

BHARATA-RATNA-FOR-PV-NARASIMHARAO

హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వానికి పీవీ ప్రతీక, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిన మహానేత అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్డుకు ‘పీవీ జ్ఞానమార్గ్’ అనే పేరును పెడుతున్నామన్న సీఎం తెలంగాణ అస్తిత్వానికి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధానిగా అనేక సంస్కరణలను చేపట్టి మన దేశాన్ని అభివృద్ది వైపు నడిపిన మహానేత అని కొనియాడారు. ప్రపంచం గుర్తించిన గొప్ప నాయకుడని అన్నారు.

పీవీ నరసిం హరావు భారతరత్న పురస్కారానికి అన్ని రకాలా అర్హులని చెప్పారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానం చేయబోతున్నట్టు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

అలాగే నెక్లెస్ రోడ్డుకు కూడా ‘పీవీ జ్ఞానమార్గ్’ అనే పేరును పెట్టనున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాదులో పీవీ మెమోరియల్ హాల్ ను నిర్మిస్తామని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఈరోజు కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular