fbpx
Tuesday, April 23, 2024
HomeInternationalలీగ్ చివరి మ్యాచ్ లో గెలుపుతో ప్లే-ఆఫ్స్ కు బెంగళూరు!

లీగ్ చివరి మ్యాచ్ లో గెలుపుతో ప్లే-ఆఫ్స్ కు బెంగళూరు!

BENGALURU-BEAT-DELHI-CAPITALS-IN-LAST-LEAGUE-MATCH

దుబాయ్: ఐపీఎల్ 2021 లో చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పై చివరి బంతి కి గెలిచి ప్లే-ఆఫ్స్ కు విజయం తెచ్చిన ఆత్మ విశ్వాసంతో దూసుకెళ్ళింది. ప్లే-ఆఫ్స్ లో బెంగళూరు కోల్కతా నైట్రైడర్స్ తో 11వ తేదీన తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చెసిన ఢిల్లీ ప్రారంభంలో ధాటిగా ఆదినప్పటికీ 164 పరుగులకే పరిమితమయ్యింది. చేధనలో బెంగళూరు ఆరంభంలోనే తడబడింది. విరాట్ కోహ్లీ 4 పరుగులకు, పడిక్కల్ 0 కె అవుటవ్వడం బెంగళూరుని భారీగా దెబ్బతీసింది.

ఏబీ డివిలియర్స్ ధాటిగా ఆది 26 పరుగులకే అవుటవ్వగా, కేఎస్ భరత్ మరియు మ్యాక్స్వెల్ వికెట్ పడకుండా ఒక వైపు ధాటిగా ఆడుతూనే మరోవైపు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన నేపథ్యంలో తదబడినా చివరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరుని గెలిపించాడు.

దీంతో విరాట్ కోహ్లీ సంబరాలకు అడ్డే లేకుండా పోయింది. దాదాపు కప్ గెలిచినంతా సంబరాల్లో మునిగిపోయాడు. ఒక వైపు మ్యాక్స్ వెల్ అలసి పోయినప్పటికీ జాగ్రత్తగా ఆది భరత్ తో కలిసి బెంగాళూరు ను విజయ తీరాలకు చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular