టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లకుపైగా హీరోగా రాణిస్తూ, పలు బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య బాబు, తన ఎనర్జీ, యాక్టింగ్తో అభిమానులను విపరీతంగా మెప్పించారు.
ప్రస్తుతం ‘‘అఖండ 2’’ సినిమాలో నటిస్తున్న ఆయన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇండస్ట్రీలో బాలయ్య గురించి ఒక తరహా మాట వినిపిస్తుంటుంది ‘‘ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ కాదు, చాలా తగ్గే తీసుకుంటారు’’ అని.
గతంలో ‘‘వీరసింహా రెడ్డి,’’ ‘‘భగవంత్ కేసరి’’ సినిమాలకు రూ.15–18 కోట్లు మాత్రమే తీసుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, బాలయ్య రీసెంట్గా వచ్చిన ‘‘డాకు మహారాజ్’’ మూవీకి భారీ పారితోషికం అందుకున్నారని, ‘‘అఖండ 2’’కు దాదాపు రూ.35 కోట్లు తీసుకోబోతున్నారని టాక్.
అంతే కాదు, గోపీచంద్ మలినేనితో చేయనున్న తర్వాతి సినిమాకు రూ.45 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై నెట్టింట చర్చ జరుగుతోంది. బాలయ్య తన స్థాయికి తగ్గట్టే పారితోషికం పెంచుకోవడం తగినదే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, బాలయ్య రెమ్యునరేషన్ మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది.