fbpx
Thursday, April 18, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradesh5 జాతీయ అవార్డులు పొందిన ఏపీ గిరిజన సంక్షేమ శాఖ!

5 జాతీయ అవార్డులు పొందిన ఏపీ గిరిజన సంక్షేమ శాఖ!

AWARDS-FOR-TRIBAL-WELFARE-OF-ANDHRAPRADESH

అమరావతి: ఏపీకి చెందిన గిరిజన సంక్షేమశాఖ 5 జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే ఏపీ గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్ దేశం మొత్తం మీద 3 నం.1‌ అవార్డులను గెలుచుకుంది. వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ మరియు సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ జీసీసీ, జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఈ రోజు మీడియాకు తెలిపారు.

ఈ విభాగాలతో పాటు జీసీసీ మరో 5 జాతీయ అవార్డులను కూడా సాధించిందని తెలిపారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. వన్ ధన్ యోజన పథకాన్ని ఏపీలో అమలు చేయడంతో పాటు చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు తొలి ర్యాంకును పొందిందని పుష్ప శ్రీవాణి తెలిపారు.

రాష్ట్రంలో సేంద్రీయ మరియు సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు కూడా ఏపీకి మొదటి ర్యాంకును ఇచ్చారని పుష్ప శ్రీవాణి వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను కూడా సేకరించినందున జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు.

దేశంలో మాదిరిగానే రాష్ట్రంలో తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాకారమైందని పుష్ప శ్రీవాణి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular