fbpx
Thursday, February 13, 2025
HomeSportsఅర్ష్‌దీప్ సింగ్‌కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు

అర్ష్‌దీప్ సింగ్‌కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు

arshdeep-singh-icc-t20-cricketer-of-the-year

పంజాబ్: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 2024కి గాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), సికిందర్ రజా (జింబాబ్వే) వంటి దిగ్గజాలను పోటీలో మించి ఈ గౌరవాన్ని సాధించాడు.

గత ఏడాది అర్ష్‌దీప్ ప్రదర్శన తనను ప్రత్యేకంగా నిలబెట్టింది. 2024లో మొత్తం 18 టీ20 మ్యాచులు ఆడిన అతడు 36 వికెట్లు తీసి, టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు సాధించిన బౌల‌ర్‌గా నిలిచాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనూ అర్ష్‌దీప్ కీలకంగా రాణించాడు. 8 మ్యాచుల్లో 7.16 ఎకానమీతో 17 వికెట్లు తీసి, భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు.

అర్ష్‌దీప్ ఇప్పటికే టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతని ఖాతాలో 97 వికెట్లు ఉండగా, మరో మూడు వికెట్లు సాధిస్తే టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.

తన అద్భుత బౌలింగ్‌తో అర్ష్‌దీప్ టీమిండియాకు మరింత బలం చేకూర్చాడు. ఈ ఘనతతో అతనిపై మరింత విశ్వాసం పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular