fbpx
HomeAndhra Pradeshఏపీలో పాఠశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభం

ఏపీలో పాఠశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభం

AP-SCHOOLS-START-FROM-NOVEMBER-2ND

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను ప్రారంభించనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. పాఠశాలలో 1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. రెండు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే, మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు.

స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో ఇది అమలవుతుందని, డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular