fbpx
Friday, March 29, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeBig Storyసుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల నియామకం!

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల నియామకం!

9JUDGES-APPOINTED-FOR-SUPREMECOURT-BY-CENTER

ఢిల్లీ: భారత సుప్రీంకోర్టుకు నూతనంగా 9 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదంతో కేంద్రం నుండి గెజిట్‌ విడుదల అయింది. నియామకమైన నూతన జడ్జిలు: జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు.

నూతనంగా నియమకమైన ఈ 9 మంది న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ గెజెట్ ద్వారా నియామకమైన నూతన తొమ్మిది మంది న్యాయమూర్తులలో ముగ్గురు మహిళలు ఉండగా, బార్ కౌన్సిల్‌ నుండి ఒకరు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular