fbpx
Wednesday, April 24, 2024
HomeAndhra Pradeshఏపీలో రూ.1,750 కోట్లతో కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్!

ఏపీలో రూ.1,750 కోట్లతో కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్!

1750CRORES-INVESTMENT-IN-ANDHRAPRADESH-BY-KINETIC-GREEN-ENERGY

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో రూ. 1,750 కోట్లతో కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ తయారీ, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేసేందుకు సుముఖుత చూపింది. ఇందులో భాగంగా కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్‌ రితేష్‌ మంత్రి శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

కాగా ఏపీ రాజధాని విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పడానికి కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ ముందుకొచ్చింది. ఈ కంపెనీ ఇదివరకే పూణే సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఒక ప్లాంట్‌ని ఏర్పాటు చేసింది.

ప్లంట్ తో పాటు ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్‌కు తమ ప్రణాళికలను పూర్తిగా వివరించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular